జగన్ మరో సంచలన నిర్ణయం: పంచాయితీరాజ్ లో ఇంజనీరింగ్ పనులు నిలిపివేత

Published : Aug 09, 2019, 07:19 PM IST
జగన్ మరో సంచలన నిర్ణయం: పంచాయితీరాజ్ లో ఇంజనీరింగ్ పనులు నిలిపివేత

సారాంశం

పంచాయతీరాజ్‌లో ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఆదేశించారు. అందులో భాగంగా పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.586.4 కోట్ల విలువైన ఇంజినీరింగ్ పనులు ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారదర్శకంగా పనులు చేపడతామని అవినీతికి తావివ్వకుండా పనులు చేస్తామని పదేపదే చెప్తున్నారు. 

అందులో భాగంగా ప్రతీ పనిపై ఆచితూచి స్పందిస్తున్న సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్‌లో ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఆదేశించారు. 

అందులో భాగంగా పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.586.4 కోట్ల విలువైన ఇంజినీరింగ్ పనులు ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 144 పనులు నిలిచిపోనున్నాయి. విజయనగరం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ పనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటికి ముందు అనుమతి పొంది ఇప్పటి వరకు పనులు ప్రారంభించని పనులు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనులు ప్రారంభమైనా 25 శాతానికి మించని పనులపై రివ్యూ నిర్వహించాలని ఆదేశించింది. 

ఇకపోతే నిలిపివేస్తున్న 144 పనులకు సంబంధించి రీ టెండరింగ్ నిర్వహిస్తారా లేక కొత్త టెండర్లను పిలుస్తారా అన్నది తెలియాల్సి ఉంది. పనులపై పంచాయితీరాజ్ శాఖ అధికారులతో సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

పాయకరావుపేట పాపమ్మ ట్రాక్ రికార్డ్ చూసుకో: YSRCP leader Shyamala on Home minister Anitha Vangalapudi
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే