గ్లోబల్ టూరిజంలో ఏపీకి గుర్తింపు రావాలి: విజయవాడలో హయత్‌ప్లేస్ హోటల్‌ ప్రారంభించిన జగన్

Published : Aug 18, 2023, 11:48 AM ISTUpdated : Aug 18, 2023, 03:57 PM IST
గ్లోబల్ టూరిజంలో  ఏపీకి గుర్తింపు రావాలి: విజయవాడలో హయత్‌ప్లేస్ హోటల్‌ ప్రారంభించిన  జగన్

సారాంశం

పర్యాటక రంగంలో  పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు  ఏపీ సర్కార్  ఆహ్వానాలు పలుకుతుంది.  టూరిజంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా  సీఎం  జగన్ చెప్పారు.

విజయవాడ: గ్లోబల్ టూరిజం లో  ఏపీకి  మంచి గుర్తింపు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. విజయవాడలోని గుణదలలో  టూరిజం పాలసీలో నిర్మాణం పూర్తి చేసుకున్న తొలి హోటల్  హయత్ ప్లేస్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్  శుక్రవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన ప్రసంగించారు.  ఏపీ రాష్ట్రంలోకి పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా  టూరిజం పాలసీని తీసుకు వచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు  ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టుగా సీఎం జగన్  చెప్పారు.

టూరిజం పాలసీలో భాగంగా  ఈ హోటల్ కు అనుమతిని ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక రంగంలో  అగ్రస్థానంలో నిలిపేందుకు  ప్రయత్నాలు చేస్తున్నట్టుగా  సీఎం జగన్ చెప్పారు. ఈ మేరకు పలు ప్రముఖ  సంస్థలను  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించినట్టుగా  సీఎం జగన్ గుర్తు చేశారు. విజయవాడలోనే కాకుండా  రాష్ట్రమంతా హోటల్ నెట్ వర్క్ ను  విస్తరించాలని  సీఎం  జగన్  కోరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి