సెలవుపై వెళ్లిన ఏపీ సీఈఓ ద్వివేది

Published : May 10, 2019, 06:37 PM IST
సెలవుపై వెళ్లిన ఏపీ సీఈఓ ద్వివేది

సారాంశం

ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై  వెళ్లారు. ఈ నెల 11వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు ఆయన సెలవుపై వెళ్లనున్నారు. 

అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై  వెళ్లారు. ఈ నెల 11వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు ఆయన సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీన ఆయన తిరిగి విధుల్లో చేరుతారు.

ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సమయంలో  బిజీ బిజీగా ఉన్నారు. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి,. దీంతో ఈ నెల 16న ద్వివేది విధుల్లో జాయిన్ కానున్నారు. 

ఈ నెల 14వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఎజెండాను కూడ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేబినెట్ సమావేశం జరగనుంది. 
 

PREV
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu