జగన్ అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం: అజెండా ఇదే

Siva Kodati |  
Published : Jun 10, 2019, 09:20 AM IST
జగన్ అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం: అజెండా ఇదే

సారాంశం

ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం తొలి సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సోమవారం జరగనుంది. 8 అంశాల అజెండాను సమావేశంలో చర్చించనున్నారు. 

ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం తొలి సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సోమవారం జరగనుంది. 8 అంశాల అజెండాను సమావేశంలో చర్చించనున్నారు.

వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ సోమవారం ఆమోద ముద్ర వేయనుంది. దీనితో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, హోంగార్డుల జీతాలు పెంపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీ విలీనం, వైఎస్సార్ రైతు భరోసాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే