బీసీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదలకు బీజేపీ డిమాండ్‌

Published : Dec 08, 2022, 03:18 AM IST
బీసీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదలకు బీజేపీ డిమాండ్‌

సారాంశం

Vijayawada: బీసీల సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా నేతలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.   

Daggubati Purandeshwari: బీసీల సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా నేతలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మైనార్టీ మోర్చా నాయకులకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీ కార్పొరేషన్లు వెనుకబడిన వర్గాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నాయని పురంధేశ్వరి ఆరోపించారు. 

బీసీ కార్పొరేషన్ల ప్రారంభంతోనే ప్రభుత్వ బాధ్యత ముగిసిపోదనీ, వాటికి కూడా నిధులు విడుదల చేయాలని ఆమె అన్నారు. మైనార్టీ మోర్చా నాయకులను ఉద్దేశించి పురంధేశ్వరి మాట్లాడుతూ దేశంలో మైనారిటీలకు బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకులుగా పరిగణిస్తున్నాయని ఆమె అన్నారు. ట్రిపుల్ తలాక్ సమస్య నుంచి ముస్లిం మహిళలకు బీజేపీ మాత్రమే రక్షణ కల్పించిందని ఆమె అన్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించి కేంద్రప్రభుత్వ కార్యకలాపాలను వివరించాలని మైనారిటీ మోర్చా నాయకులకు దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.


మైనారిటీలకు లబ్ధి చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని ఆమె కార్యకర్తలను కోరారు. బీసీలకు నిజంగా సాధికారత కల్పించింది మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు అనీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. వాస్తవానికి, ఈ కార్పొరేషన్లు బీసీల మధ్య విభేదాలను సృష్టించాయ‌ని ఆమె అన్నారు.ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి అనీఫ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర ఇన్ చార్జి నాగోతు రమేష్ నాయుడు తదితరులు మాట్లాడారు. బీజేపీ పాలనలో దేశంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.

కాగా, బుధ‌వారం నాడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధ‌వారం నాడు విజ‌య‌వాడ‌లో భారీ బీసీ మ‌హాస‌భ‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు వైకాపా అగ్రనేత‌లు పాలుపంచుకున్నారు.  ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు పురుంధరేశ్వరి ప్రభుత్వంపై  విమర్శలు గుప్పిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu
CM Chandrababu Speech: ఏపీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu