బొమ్మ తుపాకీతో హోటల్ యజమానిని బెదిరించి...

Published : Apr 05, 2021, 08:24 AM ISTUpdated : Apr 05, 2021, 08:27 AM IST
బొమ్మ తుపాకీతో హోటల్ యజమానిని బెదిరించి...

సారాంశం

ప్రదీప్ టీ తాగేందుకు  కొర్లాం వద్ద ఓ టీ దుకాణం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఓ టీ దుకాణానికి సమీపంలో మూత్రవిసర్జన చేశాడు. 

బొమ్మ తుపాకీ చేతపట్టి ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అందరినీ కాల్చేస్తానంటూ ఓ హోటల్ యజమాని సహా.. అక్కడ ఉన్న కస్టమర్స్ ని కూడా హడలెత్తించాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళలం జిల్లా సోంపేటలోని  కొర్లాంలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు.  జయపురం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న బస్సులో నుంచి దిగిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అతని పేరు ప్రదీప్ ష్వైన్ గా గుర్తించారు. అతను ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం.

ప్రదీప్ టీ తాగేందుకు  కొర్లాం వద్ద ఓ టీ దుకాణం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఓ టీ దుకాణానికి సమీపంలో మూత్రవిసర్జన చేశాడు. దీంతో.. అక్కడ అలా చేయవద్దంటూ టీ దుకాణం యజమాని అతనిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

తాను ఎమ్మెల్యే గన్ మెన్ అంటూ చెప్పి.. తన దగ్గర ఉన్న బొమ్మ తుపాకీని యజమాని తలకు గురిపెట్టి అక్కడి వారందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ క్రమంలో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

కాగా.. నిందితుడు స్టంట్ మాస్టర్ గా పనిచేస్తాడని.. అతనికి మతిస్థిమితం సరిగాలేదని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు