ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు షాకిచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న సీఎస్కు వినతి పత్రం ఇచ్చామని బొప్పరాజు తెలిపారు.
డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణకు ప్రకటించారు. వేతనాలు సకాలంలో పడకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, సీపీఎస్ తదితర అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా వున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యాచరణ ప్రకటించారు. తమ ఉద్యమానికి ప్రభుత్వమే కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 13న సీఎస్కు వినతి పత్రం ఇచ్చామని బొప్పరాజు తెలిపారు. 50 పేజీల వినతిపత్రంలో మా డిమాండ్లు వివరించామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బొప్పరాజు వెల్లడించారు.
ఉద్యమ కార్యాచరణ ఇదే :