
తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. అల్లూరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతానికి సరదాగా వెళ్లిన నలుగురు అమ్మాయిల్లో ముగ్గురు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్ పరీక్షలు పూర్తి చేసుకుని సెలవులను ఎంజాయ్ చేయాలని వెళ్లిన ఈ విద్యార్థినులు ప్రమాదానికి గురయ్యారు.