ఏపీలో విజృంభిస్తున్న కరోనా: కొత్తగా 68కి పాజిటివ్, మరో మరణం

By telugu teamFirst Published May 20, 2020, 10:59 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 68 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరొకరు కరోనావైరస్ తో మరణించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. మంగళవారంనాటి కన్నా ఈ రోజు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 68కి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 9,159 శాంపిల్స్ ను పరీక్షించగా 68కి పాజిటివ్ గా ఉన్నట్లు తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2407కు చేరుకుంది. 

కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో మరొకరు మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 53కు చేరుకుంది. ఇప్పటి వరకు 1639 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జీ కాగా, ప్రస్తుతం 715 మంది చికిత్స పొందుతున్నారు. 

 

: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
*9,159 సాంపిల్స్ ని పరీక్షించగా 68* మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*43 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు
*కోవిడ్ వల్ల కర్నూల్ లో ఒక్కరు మరణించారు

— ArogyaAndhra (@ArogyaAndhra)

తాజాగా నమోదైన కేసుల్లో 10 కోయంబేడు మార్కెట్ తో లింకులున్న కేసులు. చిత్తూరు జిల్లాలో ఆరు, నెల్లూరు జిల్లాలో నాలుగు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కోయంబేడుతో లింకులున్నవి. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 

ట్విట్టర్ లో ఇప్పటి వరకు జిల్లాలవారీగా లెక్కలు ఇస్తూ వచ్చిన ఆరోగ్య శాఖ ప్రస్తుతం కేవలం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్యను మాత్రమే ఇస్తోంది.

 

: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2407 పాజిటివ్ కేసు లకు గాను 1639 మంది డిశ్చార్జ్ కాగా, 53 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 715.

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!