విజయనగరంలో భారీ చోరీ: 5 కేజీల బంగారం, నగదు అపహరణ.. అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానం

Siva Kodati |  
Published : Feb 23, 2022, 03:29 PM IST
విజయనగరంలో భారీ చోరీ: 5 కేజీల బంగారం, నగదు అపహరణ.. అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానం

సారాంశం

విజయనగరం (vizianagaram) జిల్లాలో భారీ చోరీ (robbery) జరిగింది. గంట స్తంభం సమీపంలోని రవి జ్యూయెలర్స్‌లో బంగారం దోచుకుపోయారు దొంగలు. దాదాపు 5 కేజీల బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. 

విజయనగరం (vizianagaram) జిల్లాలో భారీ చోరీ (robbery) జరిగింది. గంట స్తంభం సమీపంలోని రవి జ్యూయెలర్స్‌లో బంగారం దోచుకుపోయారు దొంగలు. దాదాపు 5 కేజీల బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. దీనిపై షాపు యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాల కోసం పరిశీలించారు. అయితే దీనిని అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్