బ్రేకింగ్: తిరుమల ఆలయంలో పేలిన బాయిలర్, ఐదుగురికి గాయాలు

Siva Kodati |  
Published : Oct 24, 2020, 03:48 PM IST
బ్రేకింగ్: తిరుమల ఆలయంలో పేలిన బాయిలర్, ఐదుగురికి గాయాలు

సారాంశం

తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలు తయారు చేసే పోటులో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ వున్న బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలు తయారు చేసే పోటులో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ వున్న బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.

వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో సుమారు 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

పులిహోర ప్రసాదం కోసం చింతపండు రసం వేడి చేస్తుండగా బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations in Amaravati : రాజధాని అమరావతిలోతొలిసారి గణతంత్ర వేడుకలు | Asianet Telugu
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే