బ్రేకింగ్: తిరుమల ఆలయంలో పేలిన బాయిలర్, ఐదుగురికి గాయాలు

Siva Kodati |  
Published : Oct 24, 2020, 03:48 PM IST
బ్రేకింగ్: తిరుమల ఆలయంలో పేలిన బాయిలర్, ఐదుగురికి గాయాలు

సారాంశం

తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలు తయారు చేసే పోటులో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ వున్న బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలు తయారు చేసే పోటులో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ వున్న బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.

వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో సుమారు 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

పులిహోర ప్రసాదం కోసం చింతపండు రసం వేడి చేస్తుండగా బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Watches IND vs NZ T20 World Cup: ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే | Asianet Telugu
CM Chandrababu Niadu Powerful Speech: మహిళలకు బంపర్ ఆఫర్ సీఎం పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu