ప్రొద్దుటూరులో ఐటీ శాఖ తనిఖీలు .. 300 కేజీల బంగారం సీజ్, తోటి వ్యాపారుల్లో టెన్షన్

Siva Kodati |  
Published : Oct 22, 2023, 05:53 PM IST
ప్రొద్దుటూరులో ఐటీ శాఖ తనిఖీలు .. 300 కేజీల బంగారం సీజ్, తోటి వ్యాపారుల్లో టెన్షన్

సారాంశం

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి . ఈ తనిఖీల్లో ఏకంగా 300 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు . పండుగ సీజన్‌లో గోల్డ్ షాపులు మూతపడటంతో వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు.   

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. ఈ తనిఖీల్లో ఏకంగా 300 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారానికి సంబంధించి బిల్లులు లేకపోవడంతోనే అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ, తిరుపతికి చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని పలు జ్యూవెలర్స్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిని తిరుపతికి తరలించారు. 

ఇకపోతే బులియన్, ఆభరణాల తయారీలో ప్రొద్దుటూరుకు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వుంది. అందుకే ఈ పట్టణాన్ని రెండో ముంబైగా పిలుస్తారు. కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతూ వుండటంతో అధికారులు నిఘా పెట్టారు. ప్రొద్దుటూరులో 2 వేలకు పైగా గోల్డ్ షాపులు వున్నట్లుగా అంచనా. ఇలాంటి పరిస్ధితుల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. పండుగ సీజన్‌లో గోల్డ్ షాపులు మూతపడటంతో వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

APSPDCL రిక్రూట్‌మెంట్ 2026: నెలకు 2 లక్షల వరకు జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు
కూటమిపై జగన్ సంచలన కామెంట్స్ | YS Jaganmohan Reddy Pressmeet | CM Chandrababu | Asianet News telugu