తూ.గోలో అత్యధికం: ఏపీలో 8,86,852కి చేరిన కేసులు

By Siva KodatiFirst Published Jan 23, 2021, 6:13 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 8,86,852కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 8,86,852కి చేరింది.

నిన్న ఒక్క రోజు కోవిడ్ కారణంగా విశాఖలో ఒకరు మరణించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,147కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని పలు ఆసుపత్రుల్లో 1,473 మంది చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో 172 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,78,232కి చేరుకుంది. నిన్న 43,770 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు పరీక్షల సంఖ్య 1,28,31,731కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 11, చిత్తూరు 10, తూర్పుగోదావరి 35, గుంటూరు 12, కడప 7, కృష్ణ 23, కర్నూలు 5, నెల్లూరు 1, ప్రకాశం 2, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 18, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 28 కేసులు నమోదయ్యాయి. 

 

 

: 23/01/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,83,957 పాజిటివ్ కేసు లకు గాను
*8,75,337 మంది డిశ్చార్జ్ కాగా
*7,147 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,473 pic.twitter.com/hTnGrSnfoE

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!