పిడుగురాళ్లలో వైసీపీ నేత ఇంటి ముందు 15 నాటు బాంబులు

sivanagaprasad kodati |  
Published : Dec 21, 2018, 10:27 AM IST
పిడుగురాళ్లలో వైసీపీ నేత ఇంటి ముందు 15 నాటు బాంబులు

సారాంశం

గుంటూరు జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. పిడుగురాళ్ల మండలం మంచికల్లులో పోలేరమ్మ జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

గుంటూరు జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. పిడుగురాళ్ల మండలం మంచికల్లులో పోలేరమ్మ జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా తనిఖీలు చేస్తుండగా నాటు బాంబులు బయటపడ్డాయి.

వైసీపీ నేత యరపతినేని నరసింహారావు ఇంటి ముందు ప్లాస్టిక్ బకెట్‌‌లో పాతిపెట్టి ఉంచిన 15 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం వాటిని నిర్వీర్యం చేసింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే ఎనిమిది రోజుల్లో నాల్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులే.. ఏరోజు, ఎందుకు హాలిడే?
Heavy Rain Alert : ఒకేసారి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు... మరి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సంగతేంటి?