పెరుగుతున్న కరోనా కేసులు, చిత్తూరులో అత్యధికం... ఏపీలో 8,90,441కి చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published Mar 5, 2021, 7:55 PM IST
Highlights

గత కొన్ని రోజులుగా ఏపీలో నిలకడగా వున్న కరోనా  కేసులు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 124 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 8,90,441కి చేరుకుంది.

గత కొన్ని రోజులుగా ఏపీలో నిలకడగా వున్న కరోనా  కేసులు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 124 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 8,90,441కి చేరుకుంది. కరోనా వల్ల నిన్న అనంతపురంలో ఒకరు మరణించారు. దీనితో కలిపి రాష్ట్రంలో వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,172కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 900 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 94 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనిలో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,82,369కి చేరుకుంది. ని

న్న ఒక్క రోజు రాష్ట్రంలో 51,660 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 1,41,43,911కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 10, చిత్తూరు 30, తూర్పు గోదావరి 13, గుంటూరు 16, కడప 4, కృష్ణా 18, కర్నూలు 4, నెల్లూరు 6, ప్రకాశం 0, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 13, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. 

 

 

: 05/03/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,546 పాజిటివ్ కేసు లకు గాను
*8,79,474 మంది డిశ్చార్జ్ కాగా
*7,172 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 900 pic.twitter.com/Gxaoy7VeaY

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!