కృష్ణా జిల్లాలో విషాదం.. మురికి గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి

Siva Kodati |  
Published : Jun 26, 2022, 09:18 PM ISTUpdated : Jun 26, 2022, 09:24 PM IST
కృష్ణా జిల్లాలో విషాదం.. మురికి గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి

సారాంశం

కృష్ణా జిల్లా కూచిపూడిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు మురికి గుంతలో పడి ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి తండ్రి రాజేశ్ తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాబు మరణంతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.   

కృష్ణా జిల్లా కూచిపూడిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు మురికి గుంతలో పడి ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఇందిరా నగర్‌కు చెందిన కొక్కిలిగడ్డ రాజేశ్ సురేఖ దంపతుల కుమారుడు మహి (11 నెలలు) ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మురికి గుంతలో పడ్డాడు. పెద్దలు గమనించేలోపే చిన్నారి మునిగి ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి తండ్రి రాజేశ్ తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాబు మరణంతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు