కేంద్ర బడ్జెట్ 2019:సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు
సినిమా థియేటర్లపై జీఎస్టీ ట్యాక్స్ను 12 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లపై జీఎస్టీ ట్యాక్స్ను 12 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.
శుక్రవారం నాడు పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో పలు అంశాలను పీయూష్ ప్రకటించారు.
సినిమా థియేటర్లపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ ట్యాక్స్ను 12 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో వినోద ప్రియులకు కాస్త ఊరట లభించనుంది. మరో వైపు ఇళ్లు కొనుగోలు దారులకు కూడ కేంద్రం శుభవార్తను అందించింది.
ఇళ్లు కొనుగోలు చేసే వారికి కూడ జీఎస్టీని మినహాయింపును కూడ త్వరలోనే ప్రకటించనున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.