Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణన్ కమిటీ సిపార్సులకు జగన్ గ్రీన్ సిగ్నల్...విద్యారంగంలో సంస్కరణలు

 విద్యారంగంలో సమూల మార్పులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన  బాలకృష్ణన్ కమిటీ సిపార్సులకు సీఎం జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది.  

ap cm ys jagan accepted balakrishnan committee recomondations both school and higher education
Author
Amaravathi, First Published Oct 29, 2019, 7:47 PM IST

అమరావతి: విద్యారంగంలో సంస్కరణలపై తమ సిఫార్సులను ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీ  సీఎం వైఎస్‌.జగన్‌కు వివరించింది.పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై తమ సిఫార్సులను సీఎంకు వివరించారరు ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌. ఈ  సిఫార్సులపై  కమిటీ సభ్యులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశంలో సీఎం వ్యాఖ్యలు:

''వచ్చే ఏడాది 1 నుంచి 8 తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నాం.దీనికి సంబంధించి పాఠ్యప్రణాళికను వెంటనే తయారుచేయాల్సి ఉంది.విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి. స్కూల్స్‌కు సంబంధించి చూస్తే టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి.స్కూళ్లను ఇంగ్లిషు మీడియంలోకి మారుస్తున్నాం.దీనికోసం మంచి పాఠ్యప్రణాళిక రూపొందించాలి.

స్కూళ్లలో ప్రారంభించిన నాడు –నేడు కార్యక్రమం కొనసాగాలి. ఆ తర్వాత కూడా వాటి నిర్వహణ బాగుండాలి.ఇవన్నీకూడా సక్రమంగా చేయగలిగితే... మంచిమార్పులు వస్తాయి
45వేల స్కూళ్లలను అభివృద్దిచేస్తున్నాం.పిల్లలకోసం ఏర్పాటు చేసే ఫర్నిచర్‌ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు. పాఠ్యప్రణాళిక చాలా బలోపేతంగా ఉండాలి.

read more చంద్రబాబు-పవన్ ల వ్యూహానికి జగన్ చెక్ : నేరుగా రంగంలోకి సీఎం, ఇక సమరమే...

ప్రైవేటు స్కూల్స్‌ ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలుచేస్తున్నాయి.ప్రైవేటు స్కూళ్లలో ఉన్న నాణ్యత, ప్రమాణాలను కూడా పరిశీలించాలి. దీనిపైకూడా నియంత్రణ ఉండాలి.
నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఈ పరిశీలన చేయాలి.విద్య అన్నది ఆదాయం కోసం కాదు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో క్వాలిటీని పరిశీలించాలి, పర్యవేక్షించాలి.
దీనిపై మార్గదర్శకాలు విడుదల చేయాలి.

అగ్రికల్చర్‌ కాలేజీకి 100 ఎకరాలు ఉంటేనే అనుమతి ఇవ్వాలి.కాని, రాష్ట్రంలోని ప్రై వేటు అగ్రికల్చర్‌ కాలేజీల్లో ఈ భూమి ఉండడం లేదు కదా? ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు.దీనిపై రెగ్యులేటరీ కమిషన్‌ నియంత్రణచేయాలి. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో సరైన సదుపాయాలు, ప్రమాణాలు లేకున్నా నడుస్తున్నాయి. ప్రమాణాలను ఉల్లంఘించిన వాటిని మూసివేయాలి.వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది, దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది.

కాలేజీల్లో పాఠ్యప్రణాళిక కూడా మార్చాలి. ఖచ్చితంగా ఒక సంవత్సరం అప్రెంటిస్‌ కాలేజీల్లో ఉండాలి. చదువు అనేది కచ్చితంగా ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలి. ప్రైవేటు యూనివర్శిటీల్లో నాణ్యతాప్రమాణాలపై మనం నియంత్రణ చేయలేనప్పుడు వాటిని ఎందుకు ప్రోత్సహించాలి?.వారి ప్రమాణాలను తనిఖీచేసే అవకాశం లేనప్పుడు ఎందుకు ప్రోత్సహించాలి.

ప్రైవేటు యూనివర్శిటీల్లో క్వాలిటీ లేనప్పుడు వారిచ్చే సర్టిఫికెట్లకు ఏం వాల్యూ ఉంటుంది. ప్రైవేటు యూనివర్శిటీల పాఠ్యప్రణాళికమీదగాని, ప్రమాణాలమీదగాని  నియంత్రణ ఉండనప్పుడు ఏం ఉపయోగం?అసలు కొంతమంది ప్రైవేటు కాలేజీలను ఎందుకు నడుపుతున్నారు? వారి లక్ష్యాలు ఏంటి? డబ్బు సంపాదనా?లేక మంచి విద్యను అందించాలన్న అన్నదానిపై స్పష్టత ఉండాలి.

read more నా కళ్లు చెవులు, కలెక్టర్లు, ఎస్పీలే... అందుకోసమే స్పందన...: జగన్

విద్య అనేది వ్యాపారం కోసం, డబ్బుకోసం కాదు. ఇది ఒక ఛారిటీ. విద్య అనేది డబ్బుకోసం కాదని చట్టమే చెప్తోంది.ప్రాథమిక, ఉన్నత విద్యా రంగాల్లో ఈ అంశాన్ని బలంగా చెప్పేలా ఉండాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయాలి. కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. లేకపోతే వ్యవస్థలు కూలిపోతాయి. కాలక్రమంలో మనం దీన్ని విస్మరించాం. కాని ఇప్పుడు బాధ్యతను తీసుకుని వీటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం. వీటన్నింటిమీదా కమిటీ దృష్టి పెట్టాలి.

కమిటీలో ఉన్న వారంతా ప్రముఖులు, విద్యావేత్తలు. కమిటీ కేవలం సిఫార్సులు ఇవ్వడంలోనేకాదు, అమలులో కూడా భాగస్వాములు కావాలి, మనం అనుకున్న లక్ష్యాలను చేరాలి
ఈ కమిటీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెగ్యులేటరీ కమిషన్లతో నిరంతరం చర్చించాలి.తీసుకొస్తున్న సంస్కరణలు, అమలుచేస్తున్న విధానాలమీద రెగ్యులేటర్‌ కమిషన్‌కు తెలియజేయాలి.విద్యాశాఖలోని అధికారులు వారధిలా పనిచేయాలి. విద్యారంగంలో సంస్కరణలపై పనిచేస్తున్న కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను.'' అని జగన్ వెల్లడించారు. 

  

Follow Us:
Download App:
  • android
  • ios