కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న పూజా హెగ్డే.. వరుస ఫ్లాప్ లు వెంటాడుతున్న తగ్గేది లేదంటున్న బ్యూటీ..
గత రెండుమూడేళ్లుగా వరుస ప్లాప్ లు చూస్తోంది పూజా హెగ్డే. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఈబ్యూటీకి కాలం కలిసిరావడం లేదు. అయినా సరే తగ్గేదే లేదంటోంది.
2022 నుండి అస్సలు కలిసిరాలేదు పూజా హెగ్డేకు. ఏ సినిమా చేసిన ప్లాప్ అవ్వడం.. తాను చేయబోయే సినిమాలు ఆగిపోవడం లాంటివి చాలా జరిగాయి. గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవల్సి వచ్చింది.. విజయ్ దేవరకొండతో చేయాల్సిన జనగణమన సినిమా ఆగిపోయింది. పాన్ ఇండియా సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్లాయి.
రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్యతో పాటు.. బాలీవుడ్ లో చేసిన సినిమాలు కూడా బోల్తా కొట్టడంతో పూజాహెగ్డే కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఒక రకంగా ఆమె సినిమాలకు దాదాపు 350 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో పూజాకు ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చింది. అయినా సరే తగ్గడంలేదు పూజా.. ప్లాప్ లను పట్టించుకోకండా పర్సనల్ లైఫ్ ను కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తోంది.
ఈ పాన్ ఇండియన్ హీరోయిన్ ప్రస్తుతం కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్నట్టు తెలుస్తోంది. అది కూడా ముంబయ్ లో సముద్రం సమీపంలో 45 కోట్ల రూపాయలతో లగ్జరీ హౌస్ ను ఆమె కొనుగోలు చేసిందట. త్వరలో పూజా హెగ్డే తన కొత్త ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. 4,000 చదరపు అడుగుల స్పేస్ ఉన్న ఈ ఇంటి విలువ 45 కోట్లకు పైనే ఉండొచ్చని చెబుతున్నారు.
బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో తెలుసా.. ?
నటి పూజా హెగ్డే కొత్త ఇల్లు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉంది. గతంలో నగరంలోని మరో అపార్ట్మెంట్లో ఉండేది పూజా హెగ్డే. కెరీర్ బిగినింగ్ లో తమిళం మరియు తెలుగు చిత్రాలతో వరుస విజయాలు సాధించింది పూజ. కానీ పూజా టైమ్ బాలేదు. ఇటుబాలీవుడ్ లో ఆమెకు ఇంత వరకూ ఒక్క సినిమా కూడా వర్కవుట్ కాలేదని చెప్పొచ్చు.
ఇక ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. త్వరలో షాహిద్ కపూర్ సరసన దేవా చిత్రంలో నటించనుంది ఈ నటి. ఇంతకు ముందు బాలీవుడ్ లో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో సల్మాన్ సరసన నటించింది.
ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నిజానికి ఈ సినిమా కంటే ముందు కూడా పూజా గత నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. వీటిలో రోహిత్ శెట్టి డైరెక్షన్ లో చేసిన సర్కస్ మూవీ కూడా ఉంది.