రోజుకి 2-3 సార్లు చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటే చర్మం చల్లబడి ఎర్రగా అవ్వడం తగ్గుతుంది.
తాజా కలబంద గుజ్జును ముఖానికి రాస్తే వాపు తగ్గి, మృదువుగా అవుతుంది. దానిలోని అలెర్జీ నిరోధకాలు చర్మాన్ని చల్లబరుస్తాయి.
ముఖంలో వాపు, ఎర్రదనం తగ్గడానికి దోసకాయ ముక్కలను 20 నిమిషాలు ముఖంపై ఉంచుకోవాలి. దీనివల్ల చర్మం ఎర్రదనం, దురద తగ్గుతాయి.
కొద్దిగా చందనం పొడిని గులాబీ నీళ్ళతో కలిపి ముఖానికి రాస్తే ఎండల వల్ల వచ్చే ఎర్రదనం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఒక దూదిని చల్లటి పాలలో ముంచి ముఖానికి రాసుకోండి. దానిలోని లాక్టిక్ యాసిడ్ చర్మం ఎర్రదనాన్ని తగ్గించి మృదువుగా చేస్తుంది.
వేసవిలో బయటకు వెళ్లే ముందు సన్స్క్రీన్ వాడటం మర్చిపోకండి. ఎండల వల్ల చర్మం కాలిపోకుండా ఇది కాపాడుతుంది.