నిమ్మరసంలో నీళ్ళు కలిపి టోనర్గా వాడొచ్చు. ఈ ద్రవాన్ని ముఖానికి నేరుగా లేదా కాటన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇది చర్మాన్ని క్లీన్ చేసి.. మెరిసేలా చేస్తుంది.
నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోండి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది, మెరిసేలా చేస్తుంది. అలాగే.. చర్మంపై నల్లని మచ్చలను తగ్గిస్తుంది.
ముల్తానీ మట్టిలో నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే చర్మంలోని అదనపు నూనెను తొలగిపోతుంది. ఈ ఫ్యాక్ వేసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది.
కలబంద జెల్లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే.. చర్మాన్ని చల్లబరుస్తుంది. మంటను తగ్గిస్తుంది.
నిమ్మ తొక్కను బాగా ఆరబెట్టి పొడి చేసి, దానికి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి స్క్రబ్గా వాడండి. ఇది చర్మంలోని చనిపోయిన కణాలను తొలగిస్తుంది.
ముఖంపై ఉన్న మచ్చలు, నల్లమచ్చలు, మొటిమలను తగ్గించడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది.