వేసవిలో మొటిమలు వస్తే పుదీనా, ఓట్స్ ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఇది ముఖంలోని అదనపు నూనెను తొలగిస్తుంది.
10-15 పుదీనా ఆకులు, 1 స్పూన్ ఓట్స్, దోసకాయ రసం, తేనె అరగదీసి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.
పుదీనా, రోజ్ వాటర్ ఉపయోగించినా మొటిమలు పోతాయి. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా కూడా చేస్తుంది.
10-15 పుదీనా ఆకులు గ్రైండ్ చేసి, 1 స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడగాలి.
వేసవిలో మొటిమలు ఎక్కువైతే పుదీనా, తేనె ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఇది మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
10-15 పుదీనా ఆకులు గ్రైండ్ చేసి 1 స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసి 30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.
పుదీనాలో అలెర్జీ, బాక్టీరియా నిరోధకాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తాయి.