Telugu

విదుర నీతి ప్రకారం వీళ్లు త్వరగా చనిపోతారు

Telugu

విదురుడి నీతి గుర్తుంచుకోండి

విదురుడు మహాభారతంలోని ప్రధాన పాత్రల్లో ఒకరు. తన నీతిలో 5 రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. వారు తమ అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే చనిపోతారని వివరించారు. 

Telugu

లోభి ఎక్కువ కాలం బ్రతకడు

ప్రతి విషయంలో పిసినారిగా ఉండే వ్యక్తి కష్టాలు కొని తెచ్చుకుంటాడు. అవసరానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా చిక్కుల్లో పడతాడు. ఇలాంటి తప్పులు అతనికి మరణానికి కూడా కారణమవుతాయి. 

Telugu

కోపిష్టి కూడా త్వరగా చనిపోతాడు

చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే వ్యక్తి జీవితకాలం కూడా ఎక్కువ ఉండదు. ఎందుకంటే కోపంలో అతను ఏదో ఒక ప్రాబ్లమ్ లో చిక్కుకుంటాడు. అది అతని మరణానికి కారణం అవుతుంది.

Telugu

చట్టాన్ని ఉల్లంఘించేవాడు

చట్టంపై భయం లేని వ్యక్తి ఒకరోజు పెద్ద నేరం చేస్తాడు. ఈ నేరమే అతని జీవితానికి అంతం అవుతుంది. అందుకే చట్టాన్ని గౌరవించాలి.

Telugu

అహంకారి కూడా త్వరగా చనిపోతాడు

అహంకారం వల్ల తెలివి నాశనమవుతుంది. అహంకారం వల్ల ఏది కరెక్ట్, ఏది తప్పు అనే విశ్లేషణ లేక కష్టాలు కొని తెచ్చుకుంటాడు. ఇదే ఆ మనిషి నాశనానికి కారణం అవుతుంది.

Telugu

ధన ప్రదర్శన చేసేవాడు

తమ డబ్బును ఎక్కువగా ప్రదర్శించేవారు కూడా త్వరగా చనిపోతారు. ఎందుకంటే అలాంటి వారిపై దొంగల దృష్టి ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం అతనిపై దాడులు జరిగే అవకాశాలుంటాయి. 

వీళ్లు మాత్రం వారికి వారే పిండం పెట్టుకుంటారు

మరణానంతరం మనిషి ఆత్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

సాధువులు ధరించే కాషాయ వస్త్రాల వెనుక అంత విషయం ఉందా?

ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకొస్తుంది: ఇదే కారణం