ప్రస్తుతం నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. దీంతో చాలా మంది నిద్ర మాత్రలను ఉపయోగిస్తున్నారు.
అయితే నిద్ర మాత్రలు చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
అమెరికా పరిశోధన ప్రకారం, నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి తగ్గుతుందని చెబుతున్నారు.
అమెరికాలో ఏటా 3 నుంచి 5 లక్షల మంది నిద్రమాత్రల వల్ల మరణిస్తున్నారని పరిశోధనల్లో వెల్లడైంది.
ఏడాదికి 132 సార్లు లేదా అంతకన్నా ఎక్కువగా నిద్రమాత్రలు వాడితే ప్రమాదమని పరిశోధకులు చెబుతున్నారు.
నిద్ర మాత్రల వల్ల బీపీ, తలనొప్పి, నరాల సమస్యలు, గుండె జబ్బులు వంటివి వస్తాయి.
గర్భిణులకు మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పుట్టబోయే బిడ్డకు చాలా ప్రమాదం.
నిద్రమాత్రలు రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాల పనితీరును తగ్గిస్తాయి.