మల్లె మొక్క నాటినప్పటికీ అది అలాగే ఉంది, అస్సలు పూలు పూయడం లేదని చాలామంది బాధపడుతుంటారు.
మంచి మట్టి, ఎరువు, నీళ్లు అన్నీ అందిస్తున్నా కూడా కొన్నిసార్లు మొక్క సరిగా పెరగదు. పూలు కూడా సరిగా పూయవు.
మంచి మట్టి, సేంద్రియ ఎరువులతో పాటు మొక్కకు ద్రవరూప ఎరువు (లిక్విడ్ ఫెర్టిలైజర్) కూడా వేయాలి.
దీనికి ఏమేం కావాలంటే.. బెల్లం, వేరుశనగ చెక్క, ఆవు పేడ. వీటితో మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ను తయారు చేయవచ్చు.
బెల్లం, వేరుశనగ చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దానికి కొద్దిగా నీళ్లు కలిపి, అది పూర్తిగా కరిగిపోయేలా చూసుకోవాలి.
ఈ మిశ్రమానికి గోమూత్రం, కొద్దిగా ఆవు పేడ జోడించాలి. బెల్లం, వేరుశనగ చెక్క మిశ్రమంతో ఇవన్నీ బాగా కలిసేలా కలపాలి.
ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ను నెలకొకసారి మొక్కలకు వేస్తే చాలు. మల్లెలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.
Gold Studs: మగువలు మెచ్చే అందమైన గోల్డ్ స్టడ్స్.. ఇవిగో!
Dosa: పప్పు నానపెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు15 నిమిషాల్లో దోశ రెడీ
Pendant: సింపుల్ చైన్ కి క్లాసిక్ లుక్..Rs.1000లోపే సిల్వర్ పెండెంట్
Gas Relief Tips: ఈ ఒక్క డ్రింక్తో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య దూరం!