పాదాల పగుళ్లతో ఇబ్బందిపడుతున్నారా? అయితే.. ఇంట్లో లభించే వీటిని రాయడం వల్ల పూర్తిగా నయం చేయవచ్చు.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల పగుళ్లు రాకుండా ఉంటాయి.
పగుళ్లున్న చోట కలబంద గుజ్జు రాసి మసాజ్ చేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
రాత్రి పడుకునే ముందు గ్లిజరిన్, గులాబీ నీరు కలిపి పాదాలకు పట్టించండి. ప్రతిరోజూ ఇలా చేస్తే పగుళ్లు రావు.
రాత్రి పాదాలు కడుక్కున్న తర్వాత పగుళ్లున్న చోట ఆముదం పట్టించండి. ఇలా తరచూ చేయడం మంచిది.
వేపాకు, పచ్చి పసుపు రుబ్బి పేస్ట్లా చేయండి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించండి. పగుళ్లు, గజ్జి రాకుండా ఉంటాయి.
వారంలో రెండుసార్లు నిమ్మరసంతో పాదాలకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల పాదాలు పగలవు.