Telugu

రాత్రి ఈ పండ్లను తింటున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే

Telugu

కీరదోస

కీరదోసలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతో రాత్రుళ్లు కీరను తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్‌ కంటెంట్‌ పెరుగుతుంది.  మూత్ర విసర్జనకు  దారి తీస్తుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. 
 

Image credits: Pixabay
Telugu

అరటిపండు

రాత్రుళ్లు అరటి పండు తీసుకుంటే మంచిదని చాలా మంది భావిస్తారు. సాయంత్రం అరటి పండు తింటే మంచిదే కాదని రాత్రి తీసుకుంటే మాత్రం మెలటోనిన్ హార్మోన్‌ పెరగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. 

Image credits: Getty
Telugu

పుచ్చకాయ

వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే పండ్లలో పుచ్చకాయ ఒకటి. రాత్రుళ్లు పడుకునే ముందు పుచ్చకాయ తీసుకుంటే గ్యాస్‌, జీర్ణ సమస్యలతో పాటు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. 

Image credits: Getty
Telugu

ద్రాక్ష

ద్రాక్ష పండ్లను కూడా రాత్రుళ్లు ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. 

Image credits: Getty
Telugu

సిట్రస్‌ పండ్లు

రాత్రుళ్లు సిట్రస్‌ జాతి పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగానే వీటిలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎసిడిటీతో పాటు కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. 
 

Image credits: Getty
Telugu

మామిడిపండు

మామిడిపండ్లలో కూడా చక్కెర కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకునే సమయంలో ఈ పండ్లను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. నిద్ర సమస్య ఎక్కువ అవుతుంది.

Image credits: Getty
Telugu

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

చలకాలంలో జుట్టుకు హెన్నా ఎలా పెట్టాలో తెలుసా?

చాణక్య నీతి: వీటిని దూరం చేస్తేనే మీకు సక్సెస్ దక్కుతుంది

చాణక్య నీతి: ఈ 4 పనుల్లో ఎప్పుడూ తొందర పడొద్దు.. ఎందుకంటే?

చాణక్య నీతి.. మనుషులకు ఇవి ఎంతున్నా సరిపోవు.. ఇంకా కావాలనిపిస్తుంది