చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు 5 పనుల గురించి చెప్పారు, వీటిని చేసేవారు ఎంత కష్టపడినా పేదవారిగానే ఉంటారట.
మురికి బట్టలు వేసుకునే వ్యక్తిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది. అంటే ఎంత కష్టపడినా వారు ధనవంతులు కాలేరు.
రోజూ పళ్లు సరిగా శుభ్రం చేసుకోని వారు ధనవంతులు కాలేరు. ఇలాంటి వారిని దగ్గరకు రానివ్వడానికి ఎవ్వరూ ఇష్టపడరు.
అతిగా తినేవారిని కూడా లక్ష్మీదేవి వదిలి వెళ్తుంది. ఇలాంటి వారు సోమరితనం వల్ల జీవితంలో ఎదగలేరు.
ఇతరులతో కఠినంగా, అసభ్యంగా మాట్లాడేవారు ఎప్పుడూ ఎదగలేరు.
సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవారు జీవితాన్ని పట్టించుకోరు. వారు సంపాదన గురించి ఆలోచించరు.