మూత్ర విసర్జన సాధారణంగా ఉంటే 1- 1.5 లీటర్ల నీరు తాగవచ్చు. మీరు తక్కువ మూత్రం విసర్జన చేస్తే ఎక్కువ నీరు తాగకండి.
కిడ్నీలు సరిగ్గా వడపోత పనిచేయకపోతే శరీరంలో అదనపు నీరు చేరి వాపు, శ్వాస ఆడకపోవడం, గుండెపోటు వంటి ప్రమాదాలకు దారితీస్తుంది.
కిడ్నీ సమస్య ఉన్నవారికి పరీక్షల నివేదిక, రక్తపోటు, బరువు, మూత్రం పరిమాణాన్ని బట్టి నీరు తాగాలి. దీనికి వైద్యుల సలహా తప్పనిసరి.
డయాలసిస్ చేయించుకునేవారు సాధారణంగా 700 మి.లీ. నీరు తాగాలి. దీనివల్ల శరీరంలో ఆహారం, మందుల మధ్య సమతుల్యత ఉంటుంది.
కిడ్నీ సమస్య ఉన్నవారు నీరు మాత్రమే కాదు, పాలు, పండ్ల రసం, పుచ్చకాయ, టీ వంటివి కూడా తాగవచ్చు.