పెరుగు చల్లని స్వభావం కలిగి ఉంటుంది, చేప వేడి స్వభావం కలిగి ఉంటుంది, కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు వస్తాయి.
టీతో పాటు ఉప్పగా ఉండే స్నాక్స్ తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు రావచ్చు. టీలోని టానిన్లు, ఉప్పగా ఉండే ఆహారాలతో కలిస్తే పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది.
నూనెలో వేయించిన ఆహారాన్ని పాలు, పాల ఉత్పత్తులతో కలిపి తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు రావచ్చు. పాలు, నూనెలో వేయించిన ఆహారం వంటివి కలిసి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
పాలు, పాల ఉత్పత్తులతో సిట్రస్ పండ్లను కలిపి తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు వస్తాయి.
పెరుగు, గుడ్డు కలిపి తినకూడదు. ఈ రెండింటిలోనూ ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడం కష్టం.