Telugu

నోట్లో కరిగిపోయే నీర్ దోశ!

Telugu

బియ్యాన్ని బాగా నానబెట్టండి

నీర్ దోశను నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చేయాలంటే ఈ  టిప్స్ ఫాలో అవ్వండి. బియ్యాన్ని రుబ్బే ముందు కనీసం 4-5 గంటల పాటు నానబెట్టాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది.

Image credits: Instagram
Telugu

సన్న బియ్యం వాడండి

నీర్ దోశ చాలా సాఫ్ట్‌గా రావాలంటే సోనా మసూరి లేదా ఇతర సన్న బియ్యాన్ని వాడటం మంచిది. లావు బియ్యంతో దోశలు అంత మెత్తగా రావు.

Image credits: Instagram
Telugu

పిండి పల్చగా ఉండాలి

పిండి పాలు లాగా పల్చగా, ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే జల్లెడ లాంటి నీర్ దోశలు వేయడం అస్సలు కుదరదు.

Image credits: Instagram@youreverydaycook
Telugu

పెనం మీద పిండిని రుద్దకండి

మామూలు దోశల్లాగా గరిటెతో పిండిని పెనం మీద రుద్దకండి. దోశ పెనం మీద గుండ్రంగా పిండిని పోస్తే చాలు, అది దానంతట అదే పల్చగా విస్తరిస్తుంది.

Image credits: Instagram@youreverydaycook
Telugu

మూతపెట్టి ఉడికించండి

పెనం మీద పిండి పోసిన వెంటనే దోశపై మూత పెట్టండి. ఆ ఆవిరికే దోశ చక్కగా ఉడికిపోయి, మెత్తగా వస్తుంది.

Image credits: Instagram@easy.cookingbites

Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి

Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్

Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు