Food
బియ్యం - 1/4 కప్పు, పాలు - 1 లీటరు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్, కుంకుమ పువ్వు - కొద్దిగా, చక్కెర బదులు స్టీవియా గాని, ఎరిథ్రిటాల్ గాని, జీడిపప్పు, బాదం, పిస్తా.
ముందుగా బియ్యం కడిగి 30 నిమిషాలు నీటిలో నానబెట్టండి. తర్వాత బియ్యాన్ని కొద్దిగా గ్రైండ్ చేయండి. గిన్నెలో పాలు మరిగించాలి.
గ్రైండ్ చేసిన బియ్యాన్ని పాలలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బియ్యం బాగా ఉడికే వరకు 20-25 నిమిషాలు తక్కువ వేడి మీద పాలు ఉడికించాలి.
చక్కెర బదులు స్టీవియా గాని, ఎరిథ్రిటాల్ గాని వేయండి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత చల్లార్చి సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా పప్పును అలంకరిస్తే షుగర్ లెస్ ఫిర్నీ రెడీ. దీన్ని చల్లగా తింటేనే బాగుంటుంది.
ఫిర్నీని మరింత రుచికరంగా చేయడానికి, కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేయండి. మీరు ఫిర్నీని మరింత చిక్కగా చేయాలనుకుంటే కొద్దిగా కార్న్స్టార్చ్ను కూడా కలపండి.