కట్ చేసిన పండ్లను ఫ్రిజ్లో ఉంచితే వాటిలోని పోషకాలు నెమ్మదిగా తగ్గిపోతాయి.
పండ్లను కట్ చేసిన తర్వాత గాలి తగిలి ఆక్సీకరణం చెందుతాయి. దీనివల్ల వాటి రంగు, రుచి మారిపోతాయి.
కట్ చేసిన పండ్లను ఫ్రిజ్లో మూత లేకుండా ఉంచితే బాక్టీరియా పెరుగుతుంది. అవి తింటే కడుపు సమస్యలు వస్తాయి.
కట్ చేసిన పండ్లను గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి. నిమ్మరసం రాస్తే ఆక్సీకరణం నెమ్మదిస్తుంది.
ఆపిల్, జామ, అరటిపండు లాంటివి కట్ చేసిన వెంటనే తినేయాలి. లేదంటే రుచి, పోషకాలు తగ్గిపోతాయి.
కట్ చేసిన పండ్లను ఎక్కువసేపు బయట ఉంచితే బాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి కట్ చేసిన వెంటనే ఫ్రిజ్లో పెట్టండి.
కట్ చేసి.. ఎక్కువసేపు ఫ్రిజ్ లో పెట్టిన పండ్లను పిల్లలు, వృద్ధులకు ఇవ్వకండి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది.