బరువు తగ్గడానికి చాలా మంది చియా సీడ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం, తప్పు పద్దతిలో తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
చియా గింజల్లో ఫైబర్ ఎక్కువ. శరీరానికి ఎక్కువ ఫైబర్ అందడం వల్ల మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి వస్తుంది.
చియా గింజలు తమ బరువు కంటే 10-12 రెట్లు నీటిని పీల్చుకుంటాయి. చియా గింజలు తినడానికి కనీసం 15-20 నిమిషాల ముందు నీటిలో నానబెట్టాలి.
చియా గింజలు ఎక్కువగా తినడం వల్ల తలతిరగడం, బలహీనత లేదా హైపోగ్లైసీమియా వస్తుంది.
చియా గింజలు కొంతమందిలో దద్దుర్లు, దురద, వాంతులు వంటి లక్షణాలకు కారణం కావచ్చు.
ఎక్కువ ఫైబర్ జీర్ణవ్యవస్థను ఎక్కువగా ఉత్తేజపరిచి విరేచనాలకు దారితీస్తుంది. దీన్ని నివారించడానికి, మితంగా (రోజుకు 1-2 టేబుల్ స్పూన్లు) తినండి.
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవారిలో గ్యాస్, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.