1 కప్పు రాగి పిండి, 1 కప్పు ఇడ్లీ బియ్యం, ½ కప్పు మినపప్పు, 1 పెద్ద చెంచా మెంతులు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత నీరు, ఇడ్లీ పాత్రకు నూనె/నెయ్యి.
ఇడ్లీ బియ్యం, మినప పప్పు విడివిడిగా కడిగి, మెంతులతో కలిపి 4-6 గంటలు నానబెట్టండి.
నానపెట్టిన పదార్థాలను మెత్తగా రుబ్బుకోవాలి.
బ్యాటర్ లో రాగి పిండి కలిపి, ఉప్పు వేసి బాగా కలపండి. బ్యాటర్ చిక్కగా ఉంటే, నీళ్ళు కలపండి.
బ్యాటర్ ని 8-12 గంటలు లేదా రాత్రంతా వెచ్చని ప్రదేశంలో పులియబెట్టండి.
ఇడ్లీ పాత్రలో నీరు పోసి, పళ్ళేలకు నూనె/నెయ్యి రాసి, నీరు మరిగించండి.
పులిసిన బ్యాటర్ ని ఇడ్లీ పళ్ళేల్లో ¾ వరకు పోసి, మధ్యస్థ మంట మీద 10-15 నిమిషాలు ఉడికించండి.
ఇడ్లీలను ఆ తర్వాత కొబ్బరి చట్నీ, సాంబార్ తో వేడివేడిగా వడ్డించండి.
ఇంట్లోనే కుండీల్లోనే వంకాయలు పెంచేదెలా?
కుంకుమ పువ్వు అసలేదో, నకిలీదో గుర్తించేదెలా?
బొప్పాయి గింజలతో ఇన్ని లాభాలున్నాయా?
పరిగడుపున వెల్లుల్లి నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా