Entertainment
రణ్బీర్ కపూర్, దీపికా పదుకొనే `తమాషా` మూవీతో పాటు చాలా సినిమాల్లో కలిసి నటించారు. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
రణ్బీర్ కపూర్, దీపికా పదుకొనే చాలా కాలం రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
చాలా కాలం రిలేషన్లో ఉన్నాక 2009లో వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేశారు. దీంతో వాళ్ల ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వీరిద్దరు విడిపోవడానికి కారణమేంటి అనేది చూస్తే.
సిమీ గ్రేవాల్ చాట్ షో ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ త్రోబ్యాక్ క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో దీపికా పదుకొనే, రణ్బీర్ కపూర్ రిలేషన్పై నీతూ తన అభిప్రాయం చెప్పింది.
నీతూ కపూర్ మాట్లాడుతూ.. రణ్బీర్కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని నేను అనుకోను. వాడికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె దీపికా అని చెప్పింది.
వాళ్ల రిలేషన్షిప్లో ఏదో మిస్ అయిందని నేను అనుకుంటున్నా. వాళ్ల మధ్య ఏదో జరగకూడనిది జరిగింది. బహుశా వాళ్లిద్దరూ వాళ్లుగా లేరు. ఏదేమైనా వాళ్లు రిలేషన్ కట్ చేసుకోవాల్సింది.
ఎవరికైనా రిలేషన్స్ ఉంటాయి, వాళ్లు ముందుకు సాగిపోతారు. వాళ్ల రిలేషన్ కరెక్ట్ అయితే బ్రేకప్ ఎందుకు చేసుకుంటారు? కానీ రణ్బీర్ ఆ రిలేషన్లో లేడు అంతే" అని చెప్పింది.
రణ్బీర్ ఇప్పుడు ఆలియా భట్ను పెళ్లి చేసుకుని రాహాకి నాన్న అయ్యాడు. దీపికా పదుకొనే రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని కూతురు దువాకి అమ్మ అయింది.