బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఆకలి పరీక్ష పెడుతున్నాడు. టాస్క్ లకు, ఆహారానికి ముడి పెట్టడంతో కంటెస్టెంట్స్ అలమటిస్తున్నారు. ఈ క్రమంలో నీతి వదిలేసి దొంగలుగా మారుతున్నారు.
Bigg Boss Telugu 8 Live updates|Day 10: ఈసారి ఎలిమినేషన్ ఒక సంచలనం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండవ వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, నిఖిల్ ఉన్నారు.
కంటెస్టెంట్స్ నీతి వదిలేసి ఏం చేశారో చూడండి!
టామాటాల్లో యాపిల్ కోసం మణికంఠ, కిర్రాక్ సీత ఫైట్.. యష్మి ఊహించని ఝలక్
బిగ్ బాస్ తెలుగు 8 బుధవారం ఎపిసోడ్కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో ఫుడ్ కోసం కంటెస్టెంట్ల మధ్య ఫైట్ పెట్టాడు బిగ్ బాస్. ఎవరు ఐటెమ్ని గెలుచుకుంటే వాళ్లకే ఆ ఫుడ్. ఈ క్రమంలో టామాటాల్లో యాపిల్ కోసం పెద్ద గొడవ అయ్యింది. నాగ మణికంఠ, కిర్రాక్ సీత లకు టామాటాల్లో యాపిల్ని కనిపెట్టి తీసుకొచ్చే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికోసం ఇద్దరి మధ్య గట్టి ఫైట్ జరిగింది. చివరికి దాన్ని నాగమణికంఠ దక్కించుకున్నాడు. ఆ తర్వాత 250 గ్రాముల మురుమురాలను తీసుకురావాలని చెప్పగా, ఇద్దరూ పోటీ పడ్డారు. కానీ కచ్చితమైన క్వాంటిటీ తేలేకపోయారు. దీంతో ఇది చెల్లదు అంటూ షాకిచ్చింది జడ్జ్ గా వ్యవహరించిన యష్మి. ఈ విషయం పెద్ద రచ్చ అవుతుంది. తాజాగా విడుదలైన ప్రోమో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. చివరగా ఫుడ్ కోసం కొట్లాట వద్దు అని సీత వేడుకోవడం విశేషం.
బిగ్ బాస్ ప్రేరణకు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా!
ప్రేరణకు రష్మిక మందాన బెస్ట్ ఫ్రెండ్ అట. వీరిద్దరూ ఒకప్పుడు రూమ్ మేట్స్ అట. ఇద్దరూ కలిసి కొన్ని క్రేజీ పనులు చేశారట. అర్ధరాత్రి 2 గంటలకు స్కూటీ వేసుకుని రోడ్లపై చక్కర్లు కొట్టేవారట. రష్మిక మందాన స్టార్ హీరోయిన్ కావడంతో ప్రేరణతో పెద్దగా కలవడం లేదట.
రష్మిక నా రూమ్మేట్, అర్ధరాత్రి రోడ్లపై అలా చేసేవాళ్ళం, ప్రేరణకు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
బిగ్ బాస్ హౌస్లో ఆకలి కేకలు, తినాలంటే గెలవాల్సిందే!
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి అసలైన పరీక్ష మొదలైంది. తినాలంటే టాస్క్ గెలవాల్సిందే అని ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. మూడు క్లాన్స్ మధ్య టాస్క్ పెట్టిన బిగ్ బాస్ గెలిచిన వారికి మాత్రమే రేషన్ దక్కుతుందని చెప్పాడు.
అప్పుడు పల్లవి ప్రశాంత్ కి జరిగిందే ఇప్పుడు విష్ణుప్రియకు జరిగింది!
సామాన్యుడైన పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి అమర్ దీప్, రతికా రోజ్ నెగిటివ్ అయ్యారు. నామినేషన్స్ లో అమర్ దీప్, రతికా రోజ్ ఘాటైన పదాలతో పల్లవి ప్రశాంత్ ని విమర్శించారు. అది పల్లవి ప్రశాంత్ కి మరింత సింపథీ తెచ్చిపెట్టింది.
విష్ణుప్రియ విషయంలో కూడా అదే జరిగింది. మొదటి వారం గేమ్ పరంగా పెద్దగా ప్రభావం చూపని విష్ణుప్రియ గురించి చర్చించుకునేలా సోనియా ఆకుల కామెంట్స్ చేశాయి. విష్ణుప్రియ పట్ల ఆడియన్స్ లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అప్పుడు పల్లవి ప్రశాంత్ కి జరిగిందే ఇప్పుడు విష్ణుప్రియకు జరిగింది!
నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్, ఇంటిని వీడేది ఎవరు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండవ వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, నిఖిల్ ఉన్నారు. టాప్ సెలెబ్స్ నామినేషన్స్ లో ఉండగా ఎవరు ఇంటిని వీడినా సంచలనమే!