Oct 19, 2019, 7:48 PM IST
వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో మూడు రోజులుగా ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలను ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐటీ అధికారులు చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని బత్తువల్లం, ఉబ్బలమడుగు సమీపంలోని ఏకం ఆలయం, విడిది గృహాల్లో ఉండి సోదాలు నిర్వహిస్తున్నారు.ఆశ్రమంలో పనిచేసేవారిని, నిర్వాహకులను మాత్రమే ఆశ్రమంలోకి అనుమతి ఇస్తున్నారు. బయటివారిని అనుమతించడం లేదు. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న లోకేష్ దాసాజీ, శ్రీనివాస్ లను కూడ వేర్వేరుగా పోలీసులు ప్రశ్సిస్తున్నారు. ఆశ్రమంలో పనిచేస్తున్న దాసాజీలను కూడ ఆదాయ పన్ను శాఖాధికారులు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు.