ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ (వీడియో)

Oct 14, 2019, 8:16 PM IST

చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ జరిగింది. సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు, రెండు లక్షల రూపాయల నగదు బ్యాంకు లాకర్ నుంచి మాయమైంది. సోమవారం బ్యాంకు తాళాలు తెరిచిన బ్యాంకు అధికారులు వీటిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జాగిలాలు, క్లూస్ టీంతో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిసీలించిన  చిత్తూరు వెస్ట్ డిఎస్పీ ఈశ్వర్ రెడ్డి  ఇంటి దొంగలే ప్రణాళిక ప్రకారం చోరీ చేసారని భావిస్తున్నట్టుగా తెలిపారు.