డ్యూటీని పక్కనబెట్టి: మందేసి చిందేసిన ఆళ్లగడ్డ విద్యుత్ ఉద్యోగులు (వీడియో)

Nov 17, 2019, 3:13 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రభుత్వాధికారులు రెచ్చిపోయారు. బాధ్యతగల హోదాలో ఉన్న సంగతిని మరచిపోయి, డ్యూటీని పక్కనబెట్టి మందేసి చిందేశారు. ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ ఏడీఈఈ బదిలీకావడంతో మండలంలోని ఏఈలు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందులో వీరంతా మందేసి డ్యాన్సులు వేశారు. మండలంలోని ఆహోబిలం అటవీ ప్రాంతంలో వీరంతా విందు చేసుకున్నారు.