హైదరాబాద్‌కు మరో దిగ్గజం .. త్వరలో ‘Oppo’ డెవలెప్‌మెంట్ సెంటర్.. భారత్‌లోనే మొదటిది

sivanagaprasad kodati |  
Published : Oct 03, 2018, 10:28 AM IST
హైదరాబాద్‌కు మరో దిగ్గజం .. త్వరలో  ‘Oppo’ డెవలెప్‌మెంట్ సెంటర్.. భారత్‌లోనే మొదటిది

సారాంశం

ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరో దిగ్గజ కంపెనీ తరలిరానుంది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో హైదరాబాద్‌లో ఆర్&డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 

ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరో దిగ్గజ కంపెనీ తరలిరానుంది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో హైదరాబాద్‌లో ఆర్&డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇది భారత్‌లో తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్. భారత్‌లోని వినియోగదారులకు ప్రత్యేకమైన టెక్నాలజీని అందించాలన్న లక్ష్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పో ఇండియా ప్రెసిడెంట్‌ చార్లెస్ వాంగ్ తెలిపారు.

సరికొత్త సాంకేతికతతో భారతీయులకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఈ డెవలప్‌మెంట్ సెంటర్ ‌అత్యంత కీలకంగా వ్యవహరించనుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఒప్పోకు చైనా, జపాన్, అమెరికాల్లో మొత్తం ఆరు ఆర్&డీ సెంటర్లు వుండగా... హైదరాబాద్‌లో ఏడాది నెలకొల్పుతున్నట్లు ఆయన తెలిపారు.

చైనా తర్వాత రెండో అతిపెద్ద పరిశోధనా కేంద్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు వాంగ్ స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, మరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే