వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ...ఆ బటన్ నొక్కితే ఒకేసారి వీడియో కాలింగ్​...

Ashok Kumar   | Asianet News
Published : Apr 10, 2020, 12:12 PM IST
వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ...ఆ బటన్ నొక్కితే ఒకేసారి వీడియో కాలింగ్​...

సారాంశం

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం వీడియో కాలింగ్​ ఫీచర్​ను మరింత సులభతరం చేసింది. ఇక నుంచి గ్రూప్​లోని సభ్యులందరికీ ఒకేసారి వీడియో కాల్​ కనెక్ట్​ అయ్యే వసతిని అందుబాటులోకి తెచ్చింది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. శ్రేయోభిలాషులు, బంధువుల బాగోగులను వీడియో కాల్​, వాయిస్ ద్వారా తెలుసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వినియోగదారుల సౌకర్యార్థం వీడియో కాలింగ్ ఫీచర్​ను మరింత సులభతరం చేసింది వాట్సాప్​. ఒక గ్రూప్​లోని సభ్యులందిరికీ ఒకేసారి వీడియోకాల్ కనెక్ట్​ అయ్యే వసతిని అందుబాటులోకి తెచ్చింది. అయితే గ్రూప్​లో నలుగురికి మించి సభ్యులుంటే ఈ ఫీచర్​ ఉండదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు కూడా ఈ ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. 

also read ఐటీ కొలువులకు హైదరాబాద్ బెస్ట్... బట్ బెంగళూరు ఫస్ట్

వీడియో కాలింగ్​ ఫీచర్​ ద్వారా నలుగురితో ఒకేసారి కనెక్ట్ అయ్యే సదుపాయం ఇప్పటికే ఉంది. 2018లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే మొదట ఒక్కరికి కాల్ చేశాక యాడ్ పార్టిసిపేంట్ ఆప్షన్​ ద్వారా ఒక్కొక్కరిని కనెక్ట్ చేసుకోవాలి. కానీ కొత్త ఫీచర్​తో నేరుగా ఒకేసారి నలుగురు కనెక్ట్ అవ్వచ్చు. 

ట్రాపింగ్ బటన్ నొక్కితే ఒకేసారి నలుగురితో వీడియో కాల్‌లో మాట్లాడవచ్చు. ఈ ఫెసిలిటీతో ఆడియో కాలింగ్ కూడా చేయొచ్చు. ఫేస్ బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యాప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒకేసారి నలుగురితో వీడియో కాన్ఫరెన్స్ వసతి కల్పించినట్లు ప్రకటించింది. 

కరోనాపై అవగాహన కోసం ఇప్పటికే పలు సమాచారాన్ని వినియోగదారులకు వాట్సాప్ చేరవేస్తోంది . ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాలు, సూచనలు, ఆరోగ్య సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తోంది.

PREV
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్