తొలిసారి డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీ యాప్ ప్రారంభించిన భారత ప్రభుత్వం.. రూ.5 కోట్ల ఆదా..

By S Ashok KumarFirst Published Jan 9, 2021, 11:32 AM IST
Highlights

 డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు. డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీ యాప్ ప్రస్తుతం హిందీ ఇంకా ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉంది.

భారత ప్రభుత్వం డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీ యాప్ ప్రారంభించింది. ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ అండ్ డైరీని డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు.

డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీ యాప్ ప్రస్తుతం హిందీ ఇంకా ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉంది, త్వరలో ఇతర 15 భాషలలో ప్రారంభించనున్నారు. క్యాలెండర్ ఇంకా డైరీ థీమ్ ప్రతి నెల మార్చబడుతుంది. 

ఐదు కోట్ల రూపాయలు
 క్యాలెండర్ ముద్రణకు అయ్యే ఖర్చులో ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అవుతుందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి డిజిటల్ క్యాలెండర్, డైరీని ప్రవేశపెట్టింది.

ఈ యాప్‌ను నేషనల్ మీడియా సెంటర్‌లో లాంచ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ క్యాలెండర్ అలాగే డైరీ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లను విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మేము 11 లక్షల క్యాలెండర్లు, 90వేల డైరీలను ప్రింట్ చేస్తామని, అయితే ఈ సంవత్సరం అది డిజిటల్ ఆకృతిలో తీసుకొచ్చామని చెప్పారు.

also read 

 ఈ సందర్భంగా గోడలపై ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఇప్పుడు మొబైల్ ఫోన్లలో లభిస్తుందని జవదేకర్ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ యాప్ ప్రతి సంవత్సరం కొత్త క్యాలెండర్ అవసరాన్ని తీరుస్తుందని జావదేకర్ అన్నారు. ప్రతి నెల ఒక కొత్త థీమ్ సెట్ చేయబడుతుందని అలాగే అందులో ముఖ్యమైన సందేశాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేస్తుంది.

ఈ యాప్ డైరీకి సంబంధించి జనవరి 15 నుంచి మరో 11 భాషల్లో లభిస్తుందని అలాగే మరిన్ని ఫీచర్లు కూడా జోడించనున్నట్లు చెప్పారు. ఈ డిజిటల్ క్యాలెండర్ యాప్ ఇతర యాప్స్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంటాయని ఇంకా ఉపయోగించడానికి కూడా చాలా సులభంగా ఉంటుందని తెలిపారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క 'బ్యూరో ఆఫ్ ఔట్ ట్రీచ్ అండ్ కమ్యూనికేషన్' ఈ యాప్ రూపొందించి, అభివృద్ధి చేసింది.  

click me!