తండ్రితో ఆటో నడపమని క్రికెటర్ కి సలహా.. ఈ బౌలర్ కెరీర్‌ను ధోని ఎలా కాపాడాడో తెలుసుకోండి

Ashok Kumar   | Asianet News
Published : Feb 10, 2022, 02:02 AM IST
తండ్రితో ఆటో నడపమని క్రికెటర్ కి  సలహా.. ఈ బౌలర్ కెరీర్‌ను ధోని ఎలా కాపాడాడో తెలుసుకోండి

సారాంశం

మహ్మద్ సిరాజ్‌కి భారత క్రికెట్ జట్టు చేరే ముందు అతని ప్రయాణం అంత ఈజీ కాదు. మరోవైపు పీపిఎల్‌లో పూర్ ప్రదర్శనతో సిరాజ్‌పై నిత్యం విమర్శలు వస్తున్నాయి. మొదట్లో అతడిని జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా వచ్చినా విరాట్ కోహ్లీ అతడిపై నమ్మకం ఉంచాడు.

ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌  భారత జట్టులోకి చేరే ప్రయాణం అంత సులభం కాలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న మహ్మద్  సిరాజ్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిత్యం విమర్శలకు గురవుతున్నాడు. మొదట్లో అతడిని జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్  వచ్చినా విరాట్ కోహ్లీ అతడిపై నమ్మకం ఉంచాడు. ఇప్పుడు ఆర్‌సీబీకే కాకుండా భారత జట్టుకు కూడా ప్రధాన బౌలర్‌గా మారాడు. 2019లో క్రికెట్‌కు స్వస్తి చెప్పి తన తండ్రితో కలిసి ఆటో నడపాలని     కోరుకున్నట్లు సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

సిరాజ్ 2019 ఐపీఎల్‌లో 10లో తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం ఏడు వికెట్లు తీశాడు. ఆ సీజన్‌లో తొలి ఆరు మ్యాచ్‌ల్లో బెంగళూరు జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగింది. సీజన్ ముగిసే సమయానికి ఆ జట్టు పాయింట్ల లిస్ట్ లో  అట్టడుగున నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 2.2 ఓవర్లలో ఐదు సిక్సర్లు బాదాడు. ఈ సమయంలో అతను మొత్తం 36 పరుగులు ఇచ్చాడు. అతను రెండు బీమర్‌ల కారణంగా (బ్యాట్స్‌మన్  కంటే ఎత్తులో  బంతులు  కొట్టకుండా) బౌలింగ్ నుండి తొలగించబడ్డాడు. 

ఆ మ్యాచ్‌ను గుర్తుచేసుకుంటూ బీమర్‌ను బౌలింగ్ చేసిన తర్వాత ప్రజలు తనను చాలా విమర్శించారని సిరాజ్   ఆర్‌సి‌బి పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు. క్రికెట్ మానేసి తండ్రితో కలిసి ఆటో నడపలనుకుంటున్నట్లు సూచించారు. నా పోరాటాన్ని ప్రజలు చూడలేదు. నేను మొదటిసారి టీమ్ ఇండియాకు ఎంపికైనప్పుడు మహీ భాయ్ (mahindra singh dhoni) నా కెరీర్‌కు సంబంధించి అవసరమైన సలహాలు ఇచ్చాడు. 

ప్రజలు చెప్పేది పట్టించుకోవద్దని ధోనీ తనతో చెప్పాడని సిరాజ్ చెప్పాడు.  మీరు బాగా ఆడినప్పుడు అదే వ్యక్తులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అదే సమయంలో బాగా అడనప్పుడు  ప్రతిచర్యలను ఎప్పుడూ తీవ్రంగా పరిగణించకూడదు అని అన్నారు.

మహి భాయ్‌ చేసిన ఈ మాటలు సరైనవేనని సిరాజ్‌ తెలిపారు. నన్ను ట్రోల్ చేస్తున్నవాళ్లు తర్వాత నువ్వు బెస్ట్ బౌలర్ అని అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరి రియాక్షన్ నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఐ‌పి‌ఎల్ 2022 కోసం రిటైన్ చేయబడిన ముగ్గురు ఆర్‌సి‌బి ఆటగాళ్లలో సిరాజ్ ఒకరు. విరాట్ కోహ్లీ (15 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (7 కోట్లు)లను ఫ్రాంచైజీ తన వద్దే ఉంచుకుంది.

సిరాజ్ తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. 2020లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు అతను మరణించాడు. ఆ సమయంలో సిరాజ్ టీమ్ ఇండియాతో ఆస్ట్రేలియాలో ఉన్నాడ, తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు.

PREV
click me!

Recommended Stories

వరల్డ్ కప్ అందించాడు.. సెలక్టర్లేమో చెత్తలా పారేశారు భయ్యా
IPL Top Scorers: ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే..