కూలిన విమానం... ఎన్ఆర్ఐ వైద్య దంపతుల దుర్మరణం

By telugu teamFirst Published Aug 10, 2019, 11:12 AM IST
Highlights

గురువారం దంపతులు తమ కుమార్తె కిరణ్ తో కలిసి ఫిలడెల్ఫియా నుంచి ఓహియో కు విమానంలో బయలు దేరారు. విమానం 44 సంవత్సరాల క్రితం నాటిది కావడం గమనార్హం. విమానంలో వెళ్తుండగా అనుకోకుండా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అదుపుతప్పింది. కాగా... దానిని కంట్రోల్ చేయడం జస్వీర్ వల్ల కాలేదు. దీంతో... విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
 


ప్రైవేట్ విమానం కూలిపోయి... భారత్ కి చెందిన వైద్య దంపతులు దుర్మరణం పాలైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు వారి 19ఏళ్ల కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ కి చెందిన జస్వీర్ ఖరానా(60), ఆయన భార్య దివ్యా ఖరానా(54) ఎయిమ్స్ లో విద్యనభ్యసించారు. ఈ క్రమంలో 20 సంవత్సరాల క్రితం వీరు అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. జస్వీర్ ఓ యూనివర్శిటీలో పనిచేస్తుండగా.. దివ్య పిల్లల ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరు ఇటీవల ఓ చిన్నపాటి ఎయిర్ క్రాఫ్ట్ ని కొనుగోలు చేశారు.

గురువారం దంపతులు తమ కుమార్తె కిరణ్ తో కలిసి ఫిలడెల్ఫియా నుంచి ఓహియో కు విమానంలో బయలు దేరారు. విమానం 44 సంవత్సరాల క్రితం నాటిది కావడం గమనార్హం. విమానంలో వెళ్తుండగా అనుకోకుండా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అదుపుతప్పింది. కాగా... దానిని కంట్రోల్ చేయడం జస్వీర్ వల్ల కాలేదు. దీంతో... విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.

విమానంలో ఇందనం అయిపోవడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి మృతిపట్ల కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

click me!