అస్నాల శ్రీనివాస్ తెలుగు కవిత: ఈ రోజు

By telugu teamFirst Published May 11, 2020, 11:21 AM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. తెలుగు కవులు కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఆస్నాల శ్రీనివాస్ తన కవిత ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.

సరిహద్దులను చేరిపేస్తూ
ఆసేతు హిమాచల
జన తరంగ తురంగా
కదన కుతూహలం

విషపు కరోనా 
విస్తరణ ధిక్కరిస్తూ
జనకవాతు యుద్ధగీతం

యుద్ధసారధులకు
జన జేజేల సంకల్ప 
చప్పట్ల సంగీతం

నిర్మలమైన నీలాకాశం
పక్షుల కూజితాల
వసంతోత్సవం .
ప్రకృతి పరవశంతో 
తానావిర్భవించిన నాటి 
విమల వేడుకల కోలాహలం

భయాన్ని జయిస్తూ 
ద్వేషాన్ని దహిస్తూ
వేరుగా ఉండడంలో
ఏకాంతాన్ని అనుభవిస్తూ
భీభత్స,జ్వరామరణాలను 
అధిగమిస్తూ పునరుద్భవ జీవనం

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!