కొండపల్లి నీహారిణి తెలుగు కవిత: ప్రశ్నల బిందువులు

Published : Sep 24, 2020, 11:50 AM ISTUpdated : Sep 24, 2020, 12:04 PM IST
కొండపల్లి నీహారిణి తెలుగు కవిత: ప్రశ్నల బిందువులు

సారాంశం

తెలుగు సాహిత్యంలో కవిత్వం విశిష్టమైంది. కొండపల్లి నీహారిణి ప్రశ్నల బిందువులు అనే కవిత రాశారు. ఆ కవితను మీ కోసం అందిస్తున్నాం.


మేఘాల లాలాజలం కన్నీటిరాతలు
సందేహాల వెల్లువకెదురీద కుదరదంది
మనస్సులెట్లాగూ తళుక్కుమనడంలేదు
మట్టి తన రత్నానికి నీతిరంగునద్దింది. కథల్లో మలచిన వెతల మందు
బిడ్డలంత సమానమేనన్నా ,కొందరినే ఇష్టంగా ఎంచుకున్నది ,
ఎర్రదనాన్ని పంచమన్నది . 
కాలిబాటలనిండా మెరుపుల అక్షరాల్ని
విత్తినచేతులు ఒంటరిగా చువ్వల
వెనుక చేరిన విపత్తైన సందర్భమిది.
నిశ్శబ్దఅంతస్సారంఇంత నిస్సారమా!
దేశవాకిట ఎలుగెత్తిన కవితారవళులు
కరతాళధ్వనుల్ని విన్నది శుభ్రజ్యోత్స్నగా
నింగివెలిగినప్పుడు !
ఇప్పుడు ....ఇప్పుడు...ముసుగు గోదాముల్లో... మూలుగుల్లో...
న్యాయన్యాయాల కారణవికారాల్లో! లోకమంతా నివ్వెర గేయాలు పాడుతుంటే 
చెదబట్టని అగ్నిశిల మౌనముద్రదాల్చింది !!
కులదళాల ,కలందళాల వెనుక ఎవరికి
వారు భవనసముదాయాలయ్యారట ఈ భద్రమైదానాలపై !
భావదారిద్ర్య ప్రేలాపనలు సముద్రహోరులో వినిపించలేదప్పుడు !!
పెనుకారణాల ఆవిరులన్నీ అంబుదాలై,
వర్షించడానికి సన్నద్ధమై , ప్రశ్నల బిందువులు గుండె గోడల్ని తడిచేస్తున్నవి ! 
కన్నీటికావ్యాలలో ఆత్మసాక్షి పాదసూచికల ప్రథమ వాక్యమైంది!!

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం