కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

Published : Feb 09, 2020, 08:42 AM ISTUpdated : Feb 13, 2020, 07:29 AM IST
కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

సారాంశం

కరీంనగర్ జిల్లాలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 


కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గ్రానైట్ లారీ, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఆటో డ్రైవర్ మృతదేహం ఇరుక్కుపోయింది. అరగంటపాటు పోలీసులు ఈ మృతదేహాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.మృతులను మేక బాబు,మేక నర్సయ్య, గడ్డం అంజయ్య, మేక శేఖర్ గా గుర్తించారు. 

ఈ ప్రమాదంలో మరణించిన వారిని కొడిమ్యాల మండలం పూడూర్ నివాసులుగా గుర్తించారు. టాటా ఏస్ వాహనం కరీంనగర్ నుండి పూడూర్ కు  వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. 

ఈ లారీ మంత్రికి చెందిన గ్రానైౌట్ ఫ్యాక్టరీకి చెందిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు