
Saudi Arabian: సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని ఒక చమురు శుద్ధి కర్మాగారం డ్రోన్తో దాడికి గురైంది, దీంతో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించిదనీ, మంటలు చెలరేగాయని సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. అధికార సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదనీ, మంటలు వ్యాప్తి చెందలేదనీ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటన వేకువజామున నాలుగున్నర గంటల సమయంలో ఈ దాడి జరిగినట్టు పేర్కొంది. కానీ, ఈ దాడి ఎవరు చేశారు. డ్రోన్ స్ట్రైక్ ఎక్కడ నుండి ప్రారంభించబడిందో ? ఎలా జరిగిందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
గతంలో ఈ చమురు కేంద్రాలపై యెమెన్ కి చెందిన హౌతీ తీవ్రవాద సంస్థ దాడులు చేసింది. ఇప్పుడు కూడా ఆ ఉగ్రసంస్థనే ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. తూర్పు ప్రావిన్స్లోని అబ్కైక్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీపై 2019లో జరిగిన షాకింగ్ దాడికి ఇరాన్-మద్దతుగల హౌతీలు బాధ్యత వహించారు, దీంతో తాత్కాలికంగా రోజువారీ ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. యెమెన్లో హౌథీల ఆధీనంలో ఉన్న భూభాగంలోకి ఇంధనాల సరఫరాపై ఆంక్షలు పెట్టినందుకే ఈ దాడులు చేసినట్లు పేర్కొంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రచురించిన మంత్రిత్వ శాఖ ప్రకటన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత విడుదలైంది. ఈ దాడి గురువారం తెల్లవారుజామున 4:40 గంటలకు జరిగిందని పేర్కొంది. ఇటువంటి దాడులు సౌదీ అరేబియాపై మాత్రమే కాకుండా, ప్రపంచానికి ఇంధన సరఫరా యొక్క భద్రత, స్థిరత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2015 నుండి యెమెన్ అంతర్యుద్ధంలో పాల్గొంది, సనా రాజధానిని ఆక్రమించి అక్కడి ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించిన హౌతీలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఏడేళ్లుగా హౌథీతో జరుగుతున్న పోరులో యెమెన్ ప్రభుత్వానికి సౌదీ సాయం చేస్తోంది.
యెమెన్లో జరిగిన యుద్ధం పదివేల మంది యోధులు, పౌరులను ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్దం వల్ల ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభానికి దారితీసింది. ఇంకా చాలా మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వలస వెళ్లారు. సుదీర్ఘమైన పౌర సంఘర్షణ వల్ల సుమారు 13 మిలియన్ల యెమెన్లు ఆకలితో అలమటిస్తున్నారని UN ఆహార సంస్థ వెల్లడించింది.