నిత్యానందా మజాకా: కైలాస కరెన్సీ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే...

First Published Aug 24, 2020, 5:10 PM IST

ఆయన బ్యాంకును ఏర్పాటు చేసే ముందే తన కైలాస దేశానికి ఒక కరెన్సీని కూడా ముద్రించారు. దానికి కైలాషియన్ డాలర్ అని నామకరణం చేసారు. ఇప్పుడు ఆ కరెన్సీ విలువ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. డాలర్ యూరోలు, అన్ని కూడా దీని ముందు దిగదుడుపే. 

భారతదేశం నుండి పారిపోయి తన సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాను అని ప్రకటించుకున్న స్వామి నిత్యానంద వినాయక చవితి పండగ రోజున రిజర్వు బ్యాంకును కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.
undefined
ఆయన బ్యాంకును ఏర్పాటు చేసే ముందే తన కైలాస దేశానికి ఒక కరెన్సీని కూడా ముద్రించారు. దానికి కైలాషియన్ డాలర్ అని నామకరణం చేసారు. ఇప్పుడు ఆ కరెన్సీ విలువ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. డాలర్ యూరోలు, అన్ని కూడా దీని ముందు దిగదుడుపే.
undefined
ఇక నిత్యానంద కైలాషియన్ డాలర్ గురించిన వివరాలు తెలిస్తే నోళ్లెళ్లబెట్టాల్సిందే. ఒక్కో డాలర్ పూర్తిగా బంగారంతో మాత్రమే రూపొందించబడుతుంది. బంగారం అంటే ఏగ్రామో రెండు గ్రాములో అనుకోకండి. అక్షరాలా ఒక తులం. అంటే ఒక్కో డాలర్ తాయారు చేయడానికి 11.66 గ్రాముల వినియోగిస్తారు..
undefined
హిందూ మతంలో బంగారాన్ని కేవలం విలువైన వస్తువుగామాత్రమే కాకుండా పవిత్రంగా కూడా కొలుస్తారు అని నిత్యానంద ఈ సందర్భంగా వెల్లడించారు. కేవలం ఈ కైలాషియన్ డాలర్ మాత్రమే కాకుండా... విలువైన రాళ్లను సైతం ఆ దేశంలో కరెన్సీగా వాడుతామని చెప్పారు నిత్యానంద.
undefined
ఇక ప్రస్తుత బంగారం రేటుతో గనుక పోల్చి చూసుకుంటే... ఈ ఒక్క డాలర్ విలువ 62 వేలకు పైమాటే! డాలర్, యూరో దీనార్ ఇవేవి ఈ కైలాషియన్డాలర్ దరిదాపుల్లోకూడా లేవు. పూర్తి బంగారంతో తయారుచేసిన ఈ డాలర్ పై హైందవ చరిత్రను తెలిపే 25 వేర్వేరు ముద్రలు ముద్రించనున్నట్టు ప్రకటించాడు నిత్యానంద.
undefined
ఇక కైలాస రిజర్వు బ్యాంకు విషయానికి వస్తే...వినాయక చవితి సందర్భంగా ఈ బ్యాంకును లాంచ్ చేసినట్టుతెలిపాడు. బ్యాంకు ఎలా నడుచుకుంటుంది, దీని తీరుతెన్నులు, కరెన్సీకి సంబంధించిన 300 పేజీల డాక్యుమెంట్ సిద్ధంగా ఉందని తెలిపాడు.
undefined
ఇప్పటికే సొంత జెండా రిషభ ధ్వజ, ను ప్రకటించిన నిత్యానంద ఇప్పుడు ఏకంగా బ్యాంకును ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు. ఈ దేశానికి ఇంగ్లీష్, సంస్కృతం, తమిళ్ అధికారిక భాషలని నిత్యానంద తన వెబ్ సైట్ లో పేర్కొన్నాడు.
undefined
హిందూ భక్తుల పెట్టుబడులకు ఒక ఆవాసం కల్పించడానికి ఈ బ్యాంకును ఏర్పాటు చేశామని, ప్రపంచంలోని హిందువులంతా ఈబ్యాంకులో పెట్టుబడులు పెడతారని ఈ సందర్భంగా నిత్యానంద పేర్కొన్నాడు.
undefined
ట్రస్టు ద్వారా ఈ బ్యాంకును నిర్వహిస్తామని, ప్రపంచంలోని హిందువులందరూ ఈ బ్యాంకులో పెట్టుబడులు పెట్టొచ్చని, దీని సభ్యులకు లోన్స్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఇందులో క్రిప్టోకరెన్సీ ద్వారా లావాదేవీలు జరుగుతాయనినిత్యానంద ప్రకటించారు.
undefined
click me!